నా కోసం ప్రభాసే స్వయంగా ఆ పని చేశాడు.. నటి ఆసక్తికర కామెంట్స్

by sudharani |
నా కోసం ప్రభాసే స్వయంగా ఆ పని చేశాడు.. నటి ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి హంస నందిని హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించింది. అయితే.. హీరోయిన్‌గా అంత గుర్తింపు తెచ్చుకోని ఈమె.. తర్వాత స్పెషల్ సాంగ్స్‌తో అదరగొట్టింది. అంతా బాగానే సాగుతుంది అనుకున్న టైంలో క్యాన్సర్ బారిన పడింది. అనంతరం విదేశాల్లో చికిత్స తీసుకుని పూర్తిగా నయం అవ్వడంతో ఇండియా చేరుకున్న హంస నందిని.. ఈ మధ్య కాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. పాన్ ఇండియా ప్రభాస్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘ప్రభాస్‌కి సిగ్గు ఎక్కువ. అందుకే ఎవరితోనూ మాట్లాడరు. ఆయనతో నేను మిర్చి సినిమా చేశాను. అందులో టైటిట్ సాంగ్‌కు స్టెప్పులు వేశా. ఇక ఆ మూవీ అనంతరం నేను వేరే చిత్రంలో బిజీ అయిపోయారు. రిలీజ్ టైంలో కూడా హైదరాబాద్‌లో లేను. కొన్ని రోజుల తర్వాత వేరే సినిమా షూటింగ్ పని మీద హైదరాబాద్‌కి వచ్చినప్పుడు.. ఓ పార్టీలో ప్రభాస్ కలిశాడు. ‘మిర్చిలో నీ సాంగ్ సూపర్ హిట్ అయింది తెలుసా?’ అని అడిగారు. దానికి నేను మూవీ చూడలేదు అని చెప్పాను. దీంతో వెంటనే టికెట్ బుక్ చేసి సినిమా చూడమని చెప్పారు. అలాగే ఏ టైంకి ఆ సాంగ్ వస్తుందో కూడా చెప్పడంతో.. కరెక్ట్‌గా అదే టైంకి వెళ్లి సినిమా చూశాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ హంస నందిని కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed